+ CM K అర్హులందరికీ రుణమాఫీ అందాలి రైతు భరోసా ఇవ్వాలి f 29న రెవెన్యూ కార్యా

Generation Data
Records
Prompts
Copy
+
CM K
అర్హులందరికీ రుణమాఫీ అందాలి
రైతు భరోసా ఇవ్వాలి
f
29న రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అర్హులైన రైతులందరికీ రూ
.
రెండు లక్షల వరకు రుణ మాపీతో పాటు రైతు భరోసాను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 29న రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నాలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి పిలుపునిచ్చింది
.
ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు
.
అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ పథకం అమలు కాకపోవటంతో వారు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు
.
ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు జరిపిన మాఫీ 50 శాతం మంది రైతులకే వర్తించిందన్నారు
.
రుణమాఫీ కోసం రైతులు బ్యాంకులు
,
రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు
.
అనేక జిల్లాల్లో ఆధార్
,
రేషన్ కార్డును గమనంలోకి తీసుకుని రుణమాఫీ చేసినట్టు మంత్రులు ప్రకటించారని గుర్తు చేశారు
.
అయితే కొన్ని ప్రాంతాల్లో అర్హతలున్న వారికి కూడా రుణమాఫీ వర్తింపజేయలేదని తెలిపారు
.
అనేక ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించిందని గుర్తు చేశారు
.
రైతుల్లో పెరుగుతున్న అశాంతిని నివారించేందుకు తక్షణమే రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
.
రేషన్కార్డులు
,
ఆధార్కార్డులను పరిగణనలోకి తీసుకోరాదనీ
,
రుణమాఫీ జరిగిన వారికి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
.
INFO
Checkpoint & LoRA

Checkpoint
SeaArt Infinity
#GTA
#SeaArt Infinity
0 comment
1
0
0